కార్తీక పురాణము 30వ అధ్యాయము - కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి

నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాది మహామునుల కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను, విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయినోళ్ల కొనియాడిరి. శౌనకాది మునులకు యింకను సంశయములు తీరనందున, సూతుని గాంచి "ఓ ముని తిలకమా! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై, అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరము తరింప లేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయమేదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్షసాధన కుపకరించు వుత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు వుత్తమదైవమెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్య ఫలమిచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొంద గల ఉపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో నున్నాము. కాన దీనిని వివరించి తెలియజేయు" మని కోరిరి.

అంతట సూతుడా ప్రశ్న నాలకించి "ఓ మునులారా! మీకు కలిగిన సంశయములు తెలుసు కొన వలసినవి. కలియుగ మందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాది క్రతువు లొనర్చిన పుణ్యము, దానధర్మ ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటె ఘనమైనదని శ్రీహరి వర్ణించియున్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతియే కాదు. సృష్టికర్త యగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యముకాదు. అయినను సూక్ష్మముగా వివరించెదను.

కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను జెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీకమాసమున సూర్య భగవానుడు తులారాశి యందున్నప్పుడు శ్రీహరి ప్రీతికొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పని సరిగా నదీ స్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరి హరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలయును. ఈనెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమునగాని, శివాలయమునగగాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతిదినము సాయంకాలము పురాణపఠణము చేయవలెను. ఈవిధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశి యందున్న నెల రోజులు యీవిధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తివుండి కూడా ఆచరించక గాని, లేక ఆచరించు వారలను జూచి యెగతాళి చేసిన గాని, వారికి ధనసహాయము చేయువారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టముల పాలగుటయే గాక వారి జన్మాంతరమందు నరకములోబడి యమకింకరుల చేత నానా హింసల పాలు కాగలరు. అంతియే గాక అట్టివారు నూరుజన్మలవరకు చండాలాది హీన జన్మలెత్తుదురు.

కార్తీక మాసములో కావేరి నదిలోగాని, గంగానదిలో గాని, అఖండ గౌతమీ నదిలోగాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించినవారు యిహమందు సర్వసుఖములను అనుభవించుటయే గాక, జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు.

సంవత్సరములో వచ్చు అన్నిమాసముల కన్నా కార్తీక మాసము వుత్తమోత్తమ మైనది. అధిక ఫల దాయకమైనది. హరి హరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మజన్మల నుండి వారలకున్న సకలపాపములు హరించి, మరుజన్మ లేక, వైకుంఠ మందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే యీ వ్రతమాచరించ వలెననెడి కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు పాపాత్ములకు కర్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యేవగింపు, అసహ్యము కలుగును.

కాన, ప్రతిమానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి యిటువంటి పుణ్యకాలమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారలు కార్తీకశుద్ధ పౌర్ణమి నాడు అయినను తమశక్తి కొలదీ వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెలరోజులు చేసిన ఫలముతో సమానఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో యెప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈ నెలరోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్య తీర్థములను సేవిస్తూ, దాన ధర్మములు చేయుచున్న యెడల వారికి పుణ్యలోకమబ్బును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు యిచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి త్రింశోధ్యాయము
ముప్పదవ ఆఖరి రోజు పారాయణము సమాప్తము.

ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు
ఓం సర్వేషాం పూర్ణంభవతు ఓం శ్శాంతి శ్శాంతిః
 

Photo: కార్తీక పురాణము 30వ అధ్యాయము

కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి

నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాది మహామునుల కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను, విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయినోళ్ల కొనియాడిరి. శౌనకాది మునులకు యింకను సంశయములు తీరనందున, సూతుని గాంచి "ఓ ముని తిలకమా! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై, అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరము తరింప లేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయమేదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్షసాధన కుపకరించు వుత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు వుత్తమదైవమెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్య ఫలమిచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొంద గల ఉపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో నున్నాము. కాన దీనిని వివరించి తెలియజేయు" మని కోరిరి.

అంతట సూతుడా ప్రశ్న నాలకించి "ఓ మునులారా! మీకు కలిగిన సంశయములు తెలుసు కొన వలసినవి. కలియుగ మందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాది క్రతువు లొనర్చిన పుణ్యము, దానధర్మ ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటె ఘనమైనదని శ్రీహరి వర్ణించియున్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతియే కాదు. సృష్టికర్త యగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యముకాదు. అయినను సూక్ష్మముగా వివరించెదను.

కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను జెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీకమాసమున సూర్య భగవానుడు తులారాశి యందున్నప్పుడు శ్రీహరి ప్రీతికొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పని సరిగా నదీ స్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరి హరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలయును. ఈనెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమునగాని, శివాలయమునగగాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతిదినము సాయంకాలము పురాణపఠణము చేయవలెను. ఈవిధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశి యందున్న నెల రోజులు యీవిధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తివుండి కూడా ఆచరించక గాని, లేక ఆచరించు వారలను జూచి యెగతాళి చేసిన గాని, వారికి ధనసహాయము చేయువారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టముల పాలగుటయే గాక వారి జన్మాంతరమందు నరకములోబడి యమకింకరుల చేత నానా హింసల పాలు కాగలరు. అంతియే గాక అట్టివారు నూరుజన్మలవరకు చండాలాది హీన జన్మలెత్తుదురు.

కార్తీక మాసములో కావేరి నదిలోగాని, గంగానదిలో గాని, అఖండ గౌతమీ నదిలోగాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించినవారు యిహమందు సర్వసుఖములను అనుభవించుటయే గాక, జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు.

సంవత్సరములో వచ్చు అన్నిమాసముల కన్నా కార్తీక మాసము వుత్తమోత్తమ మైనది. అధిక ఫల దాయకమైనది. హరి హరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మజన్మల నుండి వారలకున్న సకలపాపములు హరించి, మరుజన్మ లేక, వైకుంఠ మందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే యీ వ్రతమాచరించ వలెననెడి కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు పాపాత్ములకు కర్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యేవగింపు, అసహ్యము కలుగును.

కాన, ప్రతిమానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి యిటువంటి పుణ్యకాలమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారలు కార్తీకశుద్ధ పౌర్ణమి నాడు అయినను తమశక్తి కొలదీ వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెలరోజులు చేసిన ఫలముతో సమానఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో యెప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈ నెలరోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్య తీర్థములను సేవిస్తూ, దాన ధర్మములు చేయుచున్న యెడల వారికి పుణ్యలోకమబ్బును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు యిచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి త్రింశోధ్యాయము
                   ముప్పదవ ఆఖరి రోజు పారాయణము సమాప్తము.

ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు 
ఓం సర్వేషాం పూర్ణంభవతు ఓం శ్శాంతి శ్శాంతిః

No comments:

Post a Comment