కార్తీక పురాణము 27వ అధ్యాయము - దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట

మరల అత్రిమహాముని అగస్త్యున కిట్లు వచించెను - కుంభసంభవా! ఆ శ్రీహరి దూర్వాసుని యెంతో ప్రేమతో జేరదీసి యింకను యిట్లు చెప్పెను.

"ఓ దూర్వాసమునీ! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పదిజన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము లెత్తుట కష్టము గాదు. నీవు తపశ్శాలివి. నీమాటలకు విలువ యివ్వవలెను. గాన, అందులకు నే నంగీకరించితిని. బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవముండదు. ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నాకర్తవ్యము. నీవు అంబరీషుని యింట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృతుడై ప్రాయోపవేశమొనర్ప నెంచినాడు. ఆకారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మముగాని, ప్రజాపీడనము గాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరినీ యెప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుటకంటే పాతకములేదు. విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును - బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టిలాగిన వాడును, కాలితో తన్నినవాడును, విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామమునుండి తరిమినవాడును, విప్ర పరిత్యాగ మొనరించినవాడును బ్రహ్మహంతకులే అగుదురు. కాన, ఓ దుర్వాస మహర్షీ! అంబరీషుడు నీగురించి - తపశ్శాలియు, విప్రోత్తముడును అగు దూర్వాసుడు నామూలమున ప్రాణసంకటం పొందుచున్నాడు. అయ్యో! నేను బ్రాహ్మణ హంతకుడనయితినే - యని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి, నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీ వుభయులకు శాంతి లభించును" అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు బంపెను.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి సప్తవింశోధ్యాయము
ఇరవయ్యేడవ రోజు పారాయణము సమాప్తము.
 

Photo: కార్తీక పురాణము 27వ అధ్యాయము

దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట

మరల అత్రిమహాముని అగస్త్యున కిట్లు వచించెను - కుంభసంభవా! ఆ శ్రీహరి దూర్వాసుని యెంతో ప్రేమతో జేరదీసి యింకను యిట్లు చెప్పెను.

"ఓ దూర్వాసమునీ! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పదిజన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము లెత్తుట కష్టము గాదు. నీవు తపశ్శాలివి. నీమాటలకు విలువ యివ్వవలెను. గాన, అందులకు నే నంగీకరించితిని. బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవముండదు. ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నాకర్తవ్యము. నీవు అంబరీషుని యింట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృతుడై ప్రాయోపవేశమొనర్ప నెంచినాడు. ఆకారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మముగాని, ప్రజాపీడనము గాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరినీ యెప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుటకంటే పాతకములేదు. విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును - బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టిలాగిన వాడును, కాలితో తన్నినవాడును, విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామమునుండి తరిమినవాడును, విప్ర పరిత్యాగ మొనరించినవాడును బ్రహ్మహంతకులే అగుదురు. కాన, ఓ దుర్వాస మహర్షీ! అంబరీషుడు నీగురించి - తపశ్శాలియు, విప్రోత్తముడును అగు దూర్వాసుడు నామూలమున ప్రాణసంకటం పొందుచున్నాడు. అయ్యో! నేను బ్రాహ్మణ హంతకుడనయితినే - యని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి, నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీ వుభయులకు శాంతి లభించును" అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు బంపెను.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి సప్తవింశోధ్యాయము
                           ఇరవయ్యేడవ రోజు పారాయణము సమాప్తము.

No comments:

Post a Comment