అంశుమంతుడు(సూర్యుడు)

భగవాన్ నామము స్మరించు. దానివల్ల సమస్త పాపాలు , కామ క్రోధాలు నిర్మూలమవుతాయి . భాగవన్నామము , భగవంతుడు వేరుకావు . చేతులను చరుస్తూ ఉదయం , సాయంకాలమున హరి(హర)నామ సంకీర్తన చేయండి . మీ పాపాలు , బాధలన్నీ మిమ్మల్ని వదిలి పలాయనమౌతాయి . చెట్టుక్రింద నిలబడి చప్పట్లు కొడితే చెట్టుమీది పక్షలు ఎగిరిపోతాయికదా. చప్పట్లు కొడుతూ హరి (హర) నామము చేస్తే మీ శరీరం అనే చెట్టునుండి పాపాలనే పక్షులు ఎగిరి పోతాయి .
- శ్రీ రామకృష్ణ పరమహంస .

శాస్త్రపరిజ్ఞానము అంతగా అభివృద్ధి చిందని పూర్వకాలములో ద్వాపరయుగాంతములో వేదవ్యాసుడు సూర్యుని దేవుని గా బావించమని జనులను ఉద్భోదించాడు అని అనుకోవచ్చును . . నిత్యజీవతం లో మానవునికి ఉపయోగపడే ప్రతిదీ భవవాన్‌ స్వరూపమనే భోదించాడు . భగవంతునకు భక్తునకు ఉన్న సంభందం . అలా అన్ని ఆరోగ్య సూత్రాలు ఆద్యాత్మికం గా లింక్ పెట్టి భోదించాడని ఇక్కడ గ్రహించాలి .
మార్గశిర మాసం లో అంశుమంతుడనే సూర్యుడు తన రధం లో సంచరిస్తూ ఉంటాడు . కశ్యపమహర్షి , ఊర్వశి అనే అప్సరస , రుతసేనుడనే గంధర్వుడు , మహాశంఖమనే సర్పం , తారక్ష్యుడు అనే యక్షుడు , విద్యుచ్చత్రువు అనే రాక్షసుడు , ఆయన వెంట ఉంటారు . ఆయన చీకట్లను పారద్రోలడం లో , శత్రువులను సంహరించడం లో సమర్ధుడు , సకల జగత్తుకు శుభప్రదుడు . మునీశ్వరులు ఆయన్ని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటారు . అటువంటి అంశుమంతుడు అనే ఈ ఆదిత్యుడు తొమ్మిదివేల కిరణాలతో శోభిల్లుతూ ఆకుపచ్చ వర్ణంతో ఉంటాడు అని పురాణాలు చెప్తున్నాయి .

ఒక సారి వైశంపాయనుడు వ్యాసమహర్షి ని ఈ విధం గా అడిగాడు ... ఓ మహర్షి ! ప్రతి రోజు ఆకాశం లో ఉదయించే ఆ తేజశ్శాలి ఎవరు? దేవతలు , మహర్షులు సిద్ధులు , మానవులంతా ఆ మహాపురుషుని ఆరాధిస్తూ ఉన్నారు ఆయన గురించి చెప్పండి .. అని అడుగగా ఈ విధం గా వివరించారు .

" ఓ వైశంపాయనా ! యితడు బ్రహ్మ స్వరూపం నుండి ఉద్భవించాడు . ఉత్స్క్రుస్తమైన బ్రహం తేజోరూపుడు . సాక్షాత్ బ్రహ్మమయుడే . ఈ భగవానుడు ధర్మ , అర్ధ , కామ , మోక్షము అనే నాలుగు పురుశార్ధఫలాలనిస్తాడు . ఇదే సూర్యుని యొక్క సత్యమయ స్వరూపము . లోకములయోక్క ఉత్పత్తి , పాలన ఈయన వల్లే జరుగుతాయి . ఈయన లోకరక్షకుడు . ద్విజులు మొదలైనవారు ఈ మహాత్ముని ఆరాధించి మోక్షాన్ని పొందుతారు .

సంద్యోపాసన సమయం లో బ్రహ్మవేత్తలైన బ్రాహ్మినులు తమ భుజాలను పైకెత్తి ఈ దివ్యపురుశున్నే సేవిస్తారు . ఈయన్ని ఆరాదిస్తే సమస్త దేవతలను ఆరాదిన్చినట్లే .సూర్యమండలం లో ఉన్న సాధ్యదేవిని పపాసిన్చిద్విజులంతా స్వర్గాన్ని , మోక్షాన్ని పొందుతున్నారు . సుర్యోపాసన వలనే మనుష్యులు రోగాలనుంచి విముక్తులవుతున్నారు . ఈ స్వామిని పుజించేవారికి ఎన్నడు అంధత్వము దారిద్రియము , దు:ఖము , శోకాలు కలుగవు అని తెలియజేషారు వ్యాసమహర్షి .

సూర్యుడు ఆధునిక శాస్త్రము :
ఖగోళ శాస్త్రంలోని అనేక నక్షత్రాలలో ఒక నక్షత్రం సూర్యుడు. సూర్యుడు హైడ్రోజన్ మరియు హీలియం లతో కూడిన ఒక పెద్ద వాయుగోళం. సూర్యుని గురుత్వాకర్షణ శక్తి కారణంగా సౌరకుటుంబం లోని భూమి, అంగారకుడు మొదలైన గ్రహాలు సూర్యుని చుట్టూ నిర్ధిష్ట కక్ష్యలలో తిరుగుతున్నాయి

సూర్యుడు ఎర్రగా ఉంటాడు. ఎందుకు?

సూర్యుడు ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు ఎర్రగా కనిపిస్తాడు . అసలు సూర్యుడు అంత ఎర్రగా ఎందుకుంటాడో ఇప్పుడు తెలుసుకుందాం.!
భూమి వాతావరణంలో సూర్యుడి కిరణాలు మన కంటికి చేరేంతదాకా అవి ప్రయాణించే దూరాలు మారుతూ ఉంటాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో సూర్య కిరణాలు మన కంటికి చేరేందుకు ఎక్కువ దూరం ప్రయాణించాలి. దూరంగా భూమి, ఆకాశం కలసినట్లు కనిపించే క్షితిజ రేఖకు దగ్గరగా సూర్యుడు ఉదయించే, అస్తమించే సమయాల్లో దగ్గరగా ఉండటం వల్లనే సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు.

అదే మధ్యాహ్న సమయాల్లో సూర్యుడు మన నడినెత్తిపైన ఉన్నప్పుడు కిరణాలు తక్కువ దూరంపాటు ప్రయాణించి మన కంటిని చేరుతాయి. అలాంటి సమయాల్లో సూర్యుడి రంగు మామూలుగానే ఉంటుంది. అయితే... వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తూ, తక్కువగా చెదిరిపోయే ఎరుపు రంగు మన కంటికి ఎక్కువగా చేరుకోవడం వల్ల... సూర్యుడు ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు ఎర్రగా కనిపిస్తాడు.

ఆదర్శ ప్రత్యక్ష దైవం... సూర్యభగవానుడు
ప్రత్యక్ష దైవమైన సూర్యుడు సమస్త మానవాళికి జవజీవాలను కల్పిస్తున్నాడు. ఆ భగవానుడి వల్ల మానవులే కాదు దేవతలూ మేలు పొందుతుంటారని తెలిపే కథాంశం మత్స్యపురాణంలో కనిపిస్తుంది. ఈ కథాంశంలో సూర్యుడు తన శక్తినే చంద్రుడికిచ్చి అతని వల్ల లోకాలన్నింటికీ మేలు చేయిస్తుంటాడనే ఖగోళ సంబంధమైన శాస్త్ర విషయం ఇమిడి ఉంది. సూర్యుడు క్రియాశక్తి ప్రవృత్తి, కిరణాలతో దేవతలను, పితృదేవతలను, మనుషుల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. చంద్రుడు శుక్లపక్షంలో సూర్యుడిలో ఉన్న అమృతాన్ని స్వీకరించి దాన్నే తన అమృతంగా మార్చుకుంటాడు. ఆ అమృతాన్ని సౌమ్యులు, కామ్యులు అయిన దేవతలు, పితృదేవతలు ఆహారంగా గ్రహిస్తారు. ఆ అమృతమే చంద్రుడిలో కళాక్షయ రూపంలో కనిపిస్తుంటుంది. అమృతాన్ని తాగటం వల్ల దేవతలకు కలిగే తృప్తి పదిహేను రోజులపాటు మాత్రమే ఉంటుంది. మనిషి మిగిలిన కాలంలో స్వాహాకారాలతో దేవతలను, స్వధాకారాలతో పితృదేవతలను తృప్తి పరచాల్సి ఉంటుంది. దీనికోసం అన్నం అవసరం అవుతుంది. యజ్ఞం చేసేటప్పుడు స్వాహా అని మంత్రాలకు చివర పలకటం, పితృదేవతలకు సమర్పించేటప్పుడు స్వధా అని మంత్రాల చివర పలకటం వల్ల యజ్ఞ సమయంలో కుండంలో నుంచి హవ్యం దేవతలకు, కవ్యం పితృదేవతలకు చేరుతుంటుంది. సూర్యుడు భూమి మీద అన్నానికి సంబంధించిన పంటలు పండించటానికి తన కిరణాలను ప్రసరింపచేసి ధాన్యం ఉత్పత్తి అయ్యేలా చేస్తుంటాడు. ఈ కారణం వల్లే సూర్యుడు దేవతలకు, పితృదేవతలకు, మనుషులకు ఆరాధ్యుడవుతున్నాడు. సూర్యుడు తన కిరణాల్లో నిలుపుకొన్న దేవ, పితృ, మనుష ఆహార జన్యతృప్తే సూర్య రథానికి ఉన్న చక్రం అని చెబుతారు. ఆ చక్ర శక్తి వల్లే సకల సృష్టి చైతన్యం ప్రాప్తిస్తోంది. సూర్యుడు పచ్చని గుర్రాలను పూన్చిన రథంలో ప్రయాణిస్తుంటాడు. ఈ పచ్చదనం లోకకల్యాణ సూచకం. దినస్పతి అని కీర్తిని అందుకుంటున్న సూర్యుడు అహోరాత్రులు తన ఏక చక్ర రథంపై సప్త ద్వీప సమస్త సముద్ర ఘటికమైన ఈ పృథ్వీ చక్రాన్ని అంతటిని చుట్టి వస్తుంటాడు. ఆయన అధిరోహించిన రథానికున్న గుర్రాలు సప్త ఛందోరూపాలుగా ఉంటాయి. సూర్యుడి సంకల్పాన్ని అనుసరించి కామరూపంతో, కామగమనంతో ఆ గుర్రాలు మనోవేగంతో ప్రయాణిస్తాయి. ఒకసారి రథానికి పూన్చితే మళ్లీ మళ్లీ ఆ గుర్రాలను విప్పటం, పూన్చటం చేయాల్సిన పని ఉండదు. నిరంతరం అవి అవిశ్రాంతంగా లోకకల్యాణం కోసం సూర్యభగవానుడితో పాటు సంచరిస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు ఈ గుర్రాలు కొద్దిగా ఎర్రడాలు రంగుతో కనిపిస్తాయి. ఎన్ని యుగాలు గడిచినా ఈ గుర్రాల్లో మాత్రం మార్పు ఉండదు. వాటికి వేద విజ్ఞానం అంతా అవగతమై ఉంటుంది. సృష్టిలో కర్మఫలాలను అనుసరించి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి వారికి ఎలాంటి మేలు చేసిపెట్టాలో వాటికి తెలిసి ఉంటుంది. ఈ గుర్రాల్ని కల్పం ప్రారంభంలో ఒకసారి పూన్చితే మళ్ళీ కల్పాంతంలో మహాప్రళయం సంభవించే వరకూ అవి అలా సూర్యరథాన్ని మోసుకుని పోతూనే ఉంటాయి. సూర్యుడు తన కిరణాల శక్తికి మారు రూపాలైన వాలఖిల్యులు అనే చేతి బొటనవేలు అంత పరిమాణంలో ఉండే రుషులు తన వెంట నడుస్తుండగా ఆ వెనుక మిగిలిన మహర్షులంతా వేద మంత్రాలను స్తుతిస్తుండగా గంధర్వ, అప్సరస గణాలు గీత, నృత్యాలతో సేవిస్తుండగా తన ప్రయాణాన్ని సాగిస్తుంటాడు. ఆ ప్రయాణమంతా ఓ అద్భుత సుందర దృశ్యంగా ఉంటుంది. ఈ సూర్యుడి ప్రయాణ క్రమాన్ని వివరించి చెప్పటంలో ఒక అవిశ్రాంత సేవాతత్వం భగవానుడిలో ఇమిడి ఉందని తెలిపే ఈ కథాంశం ఆవిర్భావ లక్ష్యం. భగవంతుడిని ఆరాధించేవారు ఆయనలానే అలా నిరంతరం సేవాదృక్పథంతో ముందుకు నడవాలని చెప్పటం ఈ కథాంశంలో కనిపించే సందేశం.


No comments:

Post a Comment