దేవుడి పేరు చెప్పి రాయిమీదపాలు, పెరుగు, నెయ్యి, పటికబెల్లం, తేనె వంటి పదార్థాలను పోస్తున్నారు. ఇదేమైనా అర్థమున్న పనేనా? ఇలా చేసి సాధించే ఉపయోగమేమిటి?

దీనిని అభిషేకం అంటారు. ఇది ఓ విశిష్టమైన ప్రక్రియ. హిందూధర్మంలో దేవుడి పేరు చెపి, ఆచరిస్తున్న ప్రతికార్యమూ మనిషి ఉన్నతికోసమే. అందులో భాగమే ఈ అభిషేక ప్రక్రియ కూడా. దేశీయమైన ఆవుపాలలో అద్భుతమైన శక్తి ఉంది. అలాగే, పెరుగులో, నెయ్యిలో, పుష్పాల సారంగా లభించిన మకరందమైన తేనెలో, భూసారాన్ని నింపుకున్న పటికబెల్లంలో ఇలా వీటన్నింటినీ నిర్ణీత పాళ్ళలో కలిపితే పంచామృతం తయారౌతుంది. దీనిని అమృతం అని ఊరికేనే అనలేదు. అందులో విశేష శక్తి దాగుంది.
పరమాత్మ అమృత స్వరూపుడు. ఆయనకు ప్రత్యేకించి ఈ ఔషధీకృతమైన పంచామృతాలు అవసరం లేదు. ఈ ఔషధం మన హితం కోరి, ఏర్పాటు చేసుకున్నదే. స్ఫటికం కేవలం రాయి కాదు. అందులో ఎన్నో విలువలున్నాయి. స్ఫటిక స్పర్శతో పంచామృత శక్తి ద్విగుణీకృతమౌతుంది. ఇలా స్ఫటిక శక్తి, పంచామృతంలోని ఔషధ విలువలు, మంత్ర ఉచ్ఛారణ, దైవచింతన – ఇవన్నీ కలిపి శరీరంపై, మనసుపై, బుద్ధిపై ప్రభావం చూపుతాయి. ఇది శరీరంలో సప్త ధాతువులను పరిపుష్టి చేస్తుంది. మనసులోని కాలుష్యాన్ని నివారిస్తుంది. బుద్ధిలో జడత్వం తొలగుతుంది.
ఇన్ని కార్యాలను నిర్వహించడంలో ‘తీర్థం’ విశేషమైన ప్రభావాన్ని చూపుతుందని గుర్తించారు పూర్వీకులు. దానినే శ్రద్ధతో ఆచరించి, తరించమంటోంది మన భారతీయత.

Photo: దేవుడి పేరు చెప్పి రాయిమీదపాలు, పెరుగు, నెయ్యి, పటికబెల్లం, తేనె వంటి పదార్థాలను పోస్తున్నారు. ఇదేమైనా అర్థమున్న పనేనా? ఇలా చేసి సాధించే ఉపయోగమేమిటి?

దీనిని అభిషేకం అంటారు. ఇది ఓ విశిష్టమైన ప్రక్రియ. హిందూధర్మంలో దేవుడి పేరు చెపి, ఆచరిస్తున్న ప్రతికార్యమూ మనిషి ఉన్నతికోసమే. అందులో భాగమే ఈ అభిషేక ప్రక్రియ కూడా. దేశీయమైన ఆవుపాలలో అద్భుతమైన శక్తి ఉంది. అలాగే, పెరుగులో, నెయ్యిలో, పుష్పాల సారంగా లభించిన మకరందమైన తేనెలో, భూసారాన్ని నింపుకున్న పటికబెల్లంలో ఇలా వీటన్నింటినీ నిర్ణీత పాళ్ళలో కలిపితే పంచామృతం తయారౌతుంది. దీనిని అమృతం అని ఊరికేనే అనలేదు. అందులో విశేష శక్తి దాగుంది.
పరమాత్మ అమృత స్వరూపుడు. ఆయనకు ప్రత్యేకించి ఈ ఔషధీకృతమైన పంచామృతాలు అవసరం లేదు. ఈ ఔషధం మన హితం కోరి, ఏర్పాటు చేసుకున్నదే. స్ఫటికం కేవలం రాయి కాదు. అందులో ఎన్నో విలువలున్నాయి. స్ఫటిక స్పర్శతో పంచామృత శక్తి ద్విగుణీకృతమౌతుంది. ఇలా స్ఫటిక శక్తి, పంచామృతంలోని ఔషధ విలువలు, మంత్ర ఉచ్ఛారణ, దైవచింతన – ఇవన్నీ కలిపి శరీరంపై, మనసుపై, బుద్ధిపై ప్రభావం చూపుతాయి. ఇది శరీరంలో సప్త ధాతువులను పరిపుష్టి చేస్తుంది. మనసులోని కాలుష్యాన్ని నివారిస్తుంది. బుద్ధిలో జడత్వం తొలగుతుంది. 
ఇన్ని కార్యాలను నిర్వహించడంలో ‘తీర్థం’ విశేషమైన ప్రభావాన్ని చూపుతుందని గుర్తించారు పూర్వీకులు. దానినే శ్రద్ధతో ఆచరించి, తరించమంటోంది మన భారతీయత.

No comments:

Post a Comment