వైభవంగా శృంగేరి జగద్గురు శంకరచార్య పీఠం ఉత్తరాదికారి (శిష్య ) స్వీకార మహోత్సవం

శృంగేరి జగద్గురు శంకరచార్య పీఠం ఉత్తరాదికారిగా (37 వ పీఠాదిపతిగా ) శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి వారు సన్యాసాశ్రమ స్వీకారమహోత్సవం మహా వైభవంగా జరిగింది. సుమారు 40.000 మంది భక్తుల కరతల ధ్వనులనడుమ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి తన శిష్యుడిగా శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి అని ప్రకటించారు.
శిష్య స్వీకార కార్యక్రమం 23 ఉదయం 7.30 లకు ప్రారంభం అయ్యింది..
మొదట బ్రహ్మచారి పురుస సూక్త, విరాజ హోమం చేసారు. 9 గం.లకు బ్రహ్మచారి తుంగానది దగ్గరా ప్రేశోచరణ, సర్వ,భూత,అభయా ప్రార్థన చేసి తన వస్త్రాలను వదిలి నదిలో స్నానం చేసారు. ఆ తర్వాత స్వామి వారు ఆశ్శీర్వాదించి. కాశాయ వస్ర్తం, దండం, కమడలం ఇచ్చారు. ఆ తర్వాత గురు శిష్యులు ఇద్దరు గురువుల సమాధి దగ్గరికి వేళ్ళి నమస్కారాలు చేసారు. స్వామివారు శిష్యుడుకి ఉపదేశం చేసారు…ఆ తరువాత శారద దేవికి హారతి సమర్పించారు…… . శ్రీ భారతీ తీర్థ స్వామికి గురు పూజ శ్రీ విధుశేఖర భారతీ తీర్థ స్వామి వారు చేసారు.

No comments:

Post a Comment