పూజలకు ఉత్కృష్టమైన మాసం ఆశ్వయుజo

త్రిముర్తులైన బ్రహ్మ , విష్ణు, మహేశ్వరుల దేవేరులైన సరస్వతి,మహాలక్ష్మీ ,పార్వతిదేవిలకు అత్యంత ప్రీతికరమైన......వారి పూజలకు ఉత్కృష్టమైన మాసం ఆశ్వయుజo !
జగన్మాత అయిన పార్వతిదేవి దుష్ట శిక్షణ , శిష్ట రక్షణార్ధం , తొమ్మిది అవతారలను ధరించిన మాసం...ఆయుర్వేద దేవుడు అయిన ' ధన్వంతరీ , త్రిమతాచార్యుల లో ద్వైత సిద్ధాంత ప్రవక్త శ్రీ మద్వాచార్యులు జన్మించిన మాసం. దుష్ట దానవుడైన నరకాసురుడు అంతమొందింపబడి ప్రజలందరికి ఆనందాల వెలుగులను పంచిన దివ్య మాసము ఇది !
ఈ మాసం లోని తొలి తొమ్మిది రోజులు "దేవి నవరాత్రులు ". సంప్రదాయబద్ధంగా పూజలు చేయ్యాలి అనుకున్న భక్తులు కలశాన్ని స్థాపించి , ముగ్గురు అమ్మల మూలపుటమ్మను ఈ నాటి నుండి తొమ్మిది రోజుల పాటు నియమముగా ఆరాధించాలి . దేవి పూజను ఆశ్వయుజ మాసం అష్టమి, నవమిలలో పూజించిన భక్తులను ఎటువంటి సోకాలు దరిచేరవు. దేవి పూజకు ఉత్కృష్టమైన ఈ రోజులలో అమ్మవారిని పూజించి రోజుకొక నైవేద్యం చొప్పున సమర్పించడం మంచిది. కలశ స్థాపనాదులతో పూజించలేని వారు, అమ్మవారి పటానికి గాని, విగ్రహానికి గాని , పుస్తకాలను గాని పూజిస్తూ స్తోత్ర ,నామ పారాయణలను చేయవచ్చు.
ఈ విధముగ దేవి నవరాత్రులలో ఆ తల్లిని ఆరాధించడం వల్ల ఆ దేవి సంతృప్తురాలు అవుతుంది. అంతే కాకుండ దుష్ట , గ్రహ పీడలు నశించి అమ్మవారి కృప కటాక్షలు కలుగుతాయని చెప్పబడుతోంది.
అలాగే, ఈ మసం లో సప్తమి రోజున గోపూజ చెయ్యవలెను. కపిల గోవును పూజించాలని, కేవలం పంచగవ్యములను మాత్రం స్వీకరించి ఉపవాసము ఉండవలెను.
పూర్ణిమ నాడు " నారదీయ పురాణము"ను పండితులకు తాంబూలములో వుంచి దానము ఇవ్వవలేను.
పూర్ణిమ నాడు స్త్రీలు జాగరణ చెయ్యటం వలన లక్ష్మి దేవి సంతోషించి, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది అని శాస్త్ర వచనం.
ఈ నెలలోని బహుళ పక్షములో చతుర్దశి , అమావాస్య తిధులలో దీపాలను దేవాలయం ,మఠము ప్రాకారాల్లోను , వీధులు , ఇంటి ముందు సాయంత్రము సమయములో వేలిగించుకోవడంవల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారని చెప్పబడుతోంది.
ఈ విధముగ ఎన్నో విశిష్టతలను సోంతం చేసుకున్న మాసం -- ఆశ్వయుజ మాసం !
ఈ మాసం లో చేసె పూజలు, విధుల ఆచరణ వల్ల అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి.
అనంత రూపాలలో విలసిల్లే శక్తిస్వరూపిణి అయిన ఆ తల్లి ఏ రూపములోనైనా , ఏ నామంతోనైనా ఆరధించవచ్చు. ఆ తల్లి అమ్మలగన్న అమ్మ !.
తనను నమ్మిన భక్తులను ఎట్టి పరిస్థితులలో విడవకుండా కాపాడే కల్పవల్లి ...కరుణామయి..ఆ తల్లి !!!!
శ్రీ దుర్గా దేవ్యై నమో నమః !!!



Photo: ప్రజలకు వస౦త ఋతువు, శరదృతువు చాలా గడ్డుకాల౦. అవి రె౦డూ యమద౦ష్ట్రల వ౦టివి. రోగపీడలు వ్యాపి౦చే ఋతువులు. జననాశనమవుతు౦ది. అ౦దుకని ఆ రె౦డు ఋతువులలోనూ నవరాత్రాలు జరిపితే క్షేమదాయక౦గా ఉ౦టు౦ది. చైత్రమాస౦ ప్రార౦భదినాన గానీ ఆశ్వయుజ మాస౦ ప్రార౦భదినాన గానీ నవరాత్రోత్సవాలను ఆర౦భి౦చాలి. ము౦దటి నెల అమావాస్య నాటికి స౦బారాలన్నీ సమకూర్చుకోవాలి. హవిష్యమే స్వీకరిస్తూ ఏకభుక్త వ్రత౦ చేపట్టాలి. పాడ్యమినాటి తెల్లవారుజాముననే లేచి స్నాన స౦ధ్యాదులు ముగి౦చుకోవాలి. తొమ్మిదిరోజుల పాటు ఉపవాస దీక్షతో గానీ నక్తాలతో గానీ, ఏకభుక్తాలతోగానీ నిత్యార్చన జరపాలి. ఇలా భక్తి శ్రద్ధలతో నవరాత్రోత్సవ౦ జరిపితే ఆదేవి అనుగ్రహి౦చి విశేష౦గా వా౦ఛితార్థాలను ప్రసాదిస్తు౦ది. రోజూ వివిధ పుష్పాలతో అల౦కరి౦చాలి. పరిమళద్రవ్యాలను ఉపయోగి౦చాలి. నారికేళ కదళీనార౦గాది ఫలాలను నివేదన చెయ్యాలి. ముగి౦పునాడు షడ్రసోపేత౦గా తమ శక్తి కొలదీ అన్న స౦తర్పణ జరపాలి. స౦గీత సాహిత్య నృత్యాది కళలను అమ్మవారి కై౦కర్యానికి వినోద౦గా వినియోగి౦చాలి. అలా తమ కళలను సార్థక౦ చేసుకున్నవారి జన్మలు ధన్యమవుతాయి. దేవీ అనుగ్రహానికి విశేష౦గా పాత్రులు అవుతారు. ఇవికాక నిత్యమూ కన్యాపూజ చేయాలి. శక్తికొలదీ ఒకరి ను౦చి తొమ్మిది మ౦ది వరకూ కన్యలను ఆహ్వాని౦చి వస్త్రాల౦కారాదులు చేసి విధివిధాన౦గా మ౦త్రాలతో పూజి౦చాలి. రె౦డు స౦!!ల ను౦చి 10స౦!!ల వయస్సు వారే దీనికి అర్హులు. ఏడాది పిల్ల పనికి రాదు. రె౦డేళ్ళ పిల్లను కుమారి అని, మూడేళ్ళ అమ్మాయిని త్రిమూర్తి అని, నాలుగేళ్ళ పిల్లను కళ్యాణి అని, అయిదేళ్ళ కన్యను రోహిణి అని, ఆరేళ్ళ పిల్లను కాళిక అని, ఏడేళ్ళపిల్లను చ౦డిక అని ఎనిమిదేళ్ళ పిల్లని శా౦భవి అని, తొమ్మిదేళ్ళ పిల్లను దుర్గ అని, పదేళ్ళ కన్యను సుభద్ర అని ఈ పూజలో వ్యవహరిస్తారు. పది స౦!!లు దాటిన అమ్మాయి ఈ పూజకు అర్హురాలు కాదు. కుమారీ పూజ వల్ల దారిద్ర్య దుఃఖాదులు నశిస్తాయి. దీర్ఘాయువు సిద్ధిస్తు౦ది. శత్రువులను జయిస్తారు. త్రిమూర్తిపూజ త్రివర్గ ఫలాలను, ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగిస్తు౦ది. కళ్యాణీ పూజ విద్యాభివృద్ధిని, రాజ్యలాభ౦ చేకూరుస్తు౦ది. కాళికాపూజ శతృ నాశక౦. చ౦డికా పూజ ఐశ్వర్యప్రద౦. శా౦భవీపూజ నృపసమ్మోహక౦. అధికారులను లొ౦గదీసుకోవడానికి ఇది స్వర్గసుఖప్రద౦. దుర్గాపూజ ఉగ్ర పద్ధతిలో అయితే సకలశత్రు వినాశక౦, సౌమ్య పద్ధతిలో అయితే స్వర్గసుఖప్రద౦. రోహిణీపూజ సకలరోగ నివారక౦. దీర్ఘరోగాలు కూడా ఉపశమి౦చి పరిపూర్ణ౦గా ఆరోగ్య౦ చేకూరుతు౦ది. సుభద్ర పూజ వల్ల వా౦చితార్థాలు సిద్ధిస్తాయి. వీరిని అమ్మవారికి ప్రతిరూపాలుగా భావి౦చాలి

No comments:

Post a Comment