గోదానం వల్ల కలిగే విశేషఫలం

ఉద్దాలకుని కొడుకు ఔద్దాలకి. అతడి కొడుకు నాచికేతుడు./ ఒకనాడు ఔద్దాలకిఏట్రి రేవులో కుశలు, సమిధలు, కమండలువు, పూలూ అన్నీ మరచిపోయి ఇంటికి వచ్చి వాటిని నాచికేతుడిని తీసుకొని రమ్మని పంపాడు. అతడు నీటివద్దకు పోయేసరికి ఏరుపొంగి వాటిని తనలో కలుపుకొన్నది. నాచికేతుడు వాటిని కానక ఇంటికి తిరిగివచ్చి తండ్రితో ఆ సంగతి చెప్పాడు. ఔద్దాలకి కోపంతో కొడుకును ’యముడి వద్దకు పొమ్ము’ అని తిట్టాడు. నాచికేతుడు తండ్రిని క్షమించుమని కోరుతూ ఉండగానే నేలపై పడి కన్నీరుమున్నీరుగా దుఃఖించసాగాడు. ఒక పగలు రాత్రి శరీరం సుగంధయుతమై ఇంపుగొలిపింది. కొడుకు బ్రతికేసరికి తండ్రి ఆహ్లాదంతోఅతడిని జరిగిన సంగతి గురించి అడిగాడు. నాచికేతుడు తండ్రికి నమస్కరించి ఇట్లా చెప్పాడు. ’నీ ఆనతితో నేను అందమైన యముడి పటణానికి వెళ్ళి సమున్నత సింహాసనం మీద ఉన్న యమధర్మరాజును దర్శించాను. ఆయన నేను చావలేదనీ, నీ ఆజ్ఞప్రకారం యముడిని దర్శించాననీ, తిరిగి వెళ్ళమనీ తెలిపాడు. నేను ధర్మమూర్తి అయినాఅయనను పుణ్యలోకాలను చూపుమని అడిగాను. ఆయన ప్రీతితో ఒకరథం మీద నన్ను ఎక్కించుకొని పుణ్యలోకాలన్నీ దర్శింపజేశాడు.’ఈ పుణ్యలోకాలు ఎవరికి లభిస్తాయి?" అని నేను అడుగగా ’అవన్నీ గోదానం వల్ల కలిగే ఫలా’లని పేర్కొన్నాడు. గోవులు అంటే సూర్యకిరణాలు కాబట్టి గోదానం చేసిన వారు సూర్యుడివలె ప్రకాశిస్తారన్నాడు. నన్ను తిరిగి పంపాడు’ అని చెప్పి తండ్రికి పరమానందాన్ని కలిగించాడు నాచికేతుడు.

చిత్రం: గోదానం వల్ల కలిగే విశేషఫలం వినాలని ఉన్నది. చెప్పుము?
ఉద్దాలకుని కొడుకు ఔద్దాలకి. అతడి కొడుకు నాచికేతుడు./ ఒకనాడు ఔద్దాలకిఏట్రి రేవులో కుశలు, సమిధలు, కమండలువు, పూలూ అన్నీ మరచిపోయి ఇంటికి వచ్చి వాటిని నాచికేతుడిని తీసుకొని రమ్మని పంపాడు. అతడు నీటివద్దకు పోయేసరికి ఏరుపొంగి వాటిని తనలో కలుపుకొన్నది. నాచికేతుడు వాటిని కానక ఇంటికి తిరిగివచ్చి తండ్రితో ఆ సంగతి చెప్పాడు. ఔద్దాలకి కోపంతో కొడుకును ’యముడి వద్దకు పొమ్ము’ అని తిట్టాడు. నాచికేతుడు తండ్రిని క్షమించుమని కోరుతూ ఉండగానే నేలపై పడి కన్నీరుమున్నీరుగా దుఃఖించసాగాడు. ఒక పగలు రాత్రి శరీరం సుగంధయుతమై ఇంపుగొలిపింది. కొడుకు బ్రతికేసరికి తండ్రి ఆహ్లాదంతోఅతడిని జరిగిన సంగతి గురించి అడిగాడు. నాచికేతుడు తండ్రికి నమస్కరించి ఇట్లా చెప్పాడు. ’నీ ఆనతితో నేను అందమైన యముడి పటణానికి వెళ్ళి సమున్నత సింహాసనం మీద ఉన్న యమధర్మరాజును దర్శించాను. ఆయన నేను చావలేదనీ, నీ ఆజ్ఞప్రకారం యముడిని దర్శించాననీ, తిరిగి వెళ్ళమనీ తెలిపాడు. నేను ధర్మమూర్తి అయినాఅయనను పుణ్యలోకాలను చూపుమని అడిగాను. ఆయన ప్రీతితో ఒకరథం మీద నన్ను ఎక్కించుకొని పుణ్యలోకాలన్నీ దర్శింపజేశాడు.’ఈ పుణ్యలోకాలు ఎవరికి లభిస్తాయి?" అని నేను అడుగగా ’అవన్నీ గోదానం వల్ల కలిగే ఫలా’లని పేర్కొన్నాడు. గోవులు అంటే సూర్యకిరణాలు కాబట్టి గోదానం చేసిన వారు సూర్యుడివలె ప్రకాశిస్తారన్నాడు. నన్ను తిరిగి పంపాడు’ అని చెప్పి తండ్రికి పరమానందాన్ని కలిగించాడు నాచికేతుడు.

No comments:

Post a Comment