ఆంజనేయస్వామి సిందూరాన్ని పెట్టుకుంటే లాభాలు

1. ఎవరింట్లో అయితే
నిత్యం కలహాలు జరుగుతుంటాయో అటువంటి
వారు ప్రతిరోజు సింధూర ధారణ చేపడితే అన్ని రకాల
దాంపత్య సమస్యలు తొలగిపోతాయి.
2. ఎవరింట్లో అయితే భీతి, భయం వెంటాడుతుంటాయో
అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే
భయం తొలగిపోతుంది.
3.ఎవరి ఇంట్లో అయితే భార్యభర్తలు, పిల్లల
మధ్య సఖ్యత ఉండదో అటువంటి
వారు సింధూరాన్ని పెట్టుకుంటే సుఖం,
సంతోషం ప్రశాంతత లభిస్తుంది.
4. చిన్నపిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ
పిల్లలకు సింధూరాన్ని పెడితే భయం, భీతి, రోగ
బాధలు ఏమీ దచిచేరవు. ఆరోగ్యవంతులుగా ఉంటారు.
5. వివాహమైన కొత్త దంపతులు ఆంజనేయస్వామి
సింధూరాన్ని పెట్టుకుంటూ ఉంటే వారికి
పిల్లలు కలుగుతరు.
6. విద్యార్థులు,
విధ్యార్థినులు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి
అంగారాన్ని పెట్టుకుంటే పరీక్ష సమయంలో చదివిన
విషయాలన్నింటినీ మరిచిపోకుండా ఉంటారు.
7. లో బీపీ ఉన్నవారు రక్త మీనత సమస్యలతో
బాధపడేవారు ఆంజనేయస్వామి తీర్థాన్ని సేవించి
సింధూరాన్ని నుదుటికి పెట్టుకుంటే ఆరోగ్య
భాగ్యం సిద్దిస్తుంది.
8. గ్రహ బాధలు ఉన్నవారు ప్రతిరోజు సింధూరాన్ని
పెట్టుకుంటే గ్రహాల బాధ తొలగిపోతుంది.
9. ఇంట్లో ఆంజనేయస్వామికి గంధాన్ని
పూయదలచినవారు దేవుని చిత్రాన్ని
దక్షిణం వైపు ఉంచి కొద్దిగా గంధాన్ని స్వామి
కిరీటానికి పెట్టాలి. తరువాత అంతా
గంధం పూసుకుంటూ వచ్చి చివరిగా గంధాన్ని
పాదం వద్ద పెట్టి పూజిస్తే తలచిన వన్నీ
నెరవేరుతాయి.
10. ఆంజనేయస్వామికి సిందూరాన్ని పెట్టి తరువాత
దానిని పాలల్లో లేదా నీటిలో కలిపి తాగుతూ ఉంటే
దేహం వజ్రకాయమవుతుంది

No comments:

Post a Comment