దేవీ నవరాత్రులు

ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్ష పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రాత్రులను దేవినవరాత్రులు అంటారు.

పౌర్ణమి రోజున అశ్విని నక్షత్రం ఏ నెలలో అయితే ఉంటుందొ ఆ నెలను ఆశ్వీయుజమాసం అంటారు.శుక్లపక్షం అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకు గల 15 రోజుల కాలము అని అర్దం.ఇదే మొదటి పక్షం కూడా.దీనినే శుద్ధపక్షం అని కూడా అంటారు.

ఈ కాలంలో నక్షత్రమండలంలోని దేవి మండలం విశేషమైన శక్తిని కలిగి ఈ భూమి మీదకు తన విద్యుతయస్కాంత తరంగాలను,కాస్మిక్ కిరణాలను అధికంగా పంపిస్తుంటుంది.ఆ కాంతిపుంజాలను,తరంగాలను మన శారీరంలో చేరి,మనకు మరింత మానసిక,శారీరిక శక్తి చేకూరి,మేధాశక్తి పెరిగి జీవితం సుఖమయం కావాలి అంటే దేవిని (శక్తి, పార్వతి, సరస్వతి, లక్ష్మీ, దుర్గ... ఇలా ఏ పేరున పిలిచినా పలికే ఆ జగన్మాతను) ఆరాధించాలి.

ఈ నవరాత్రులలో దేవిని ఆరాధిస్తాం కనుక వీటిని దేవి నవరాత్రులు అన్నారు.
ఇవి శరత్ ఋతువులో వస్తాయి కనుక వీటిని శరన్నవరాత్రులు అంటారు.

శరత్కాలం నిర్మలత్వానికీ,శరశ్చంద్రుడు ప్రశాంతతకూ ప్రతీకలు.నిర్మలమైన ప్రేమ,కరుణ కురిపించే చల్లని మనస్సు మాతృ మూర్తి సహజ లక్షణాలు.అందుకే నిర్మల,ప్రశాంత తరంగాలతో నిండిన శరత్కాలం అంటే జగన్మాతకు అత్యంత ప్రీతి.

శరత్కాలం,వసంతకాలలను యమద్రంస్టలని,మృత్యుకోరలని అంటారు.అంటే ఆ సమయంలో యముడు తన నోటిలొని కోరలు బయటకు వస్తాయని,వాటి ద్వార ప్రజలను హరిస్తాడని శాస్త్రం.యముడు దేవుడు కదా.ఎక్కడైనా దేవుడు తన పిల్లలను చంపుతాడా? అని మీకు అనిపించవచ్చు. యముడంటే మృత్యువని కూడా అర్దం. అనేకానేక వ్యాధులు వ్యాపించి జీవరాశి మృత్యువొడిలొకి చేరే కాలమిది. అందుకే వీటిని యమద్రంస్టలన్నారు.

అందువల్ల ఈ కాలంలో దేవి ఆరాధన చేయడం చేత అంటురోగాలు, వ్యాధులు వ్యాపించకుండా ఉండి అందరూ ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో జీవించడానికి దేవి ఆరాధన తప్పక చేయలని శాస్త్ర వచనం.

No comments:

Post a Comment