కలశం

హిందూ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం.. ప్రాచీనకాలం నుంచి గృహ ప్రవేశాలకు, వివాహ శుభకార్యాలకు, నిత్య పూజా విధానాలలో, ఇంకా ఇంతరత్ర శుభకార్యాలలో కలశాన్ని తయారుచేసి, పూజిస్తారు. ఈ కలశాన్ని దివ్యమైన ప్రాణశక్తితో నిండివున్న జడ శరీరానికి ప్రతీకగా పేర్కొంటారు. అందువల్లే ఇది హిందూ శాస్త్రాలలో పూర్వం నుంచి తమ ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఇత్తడి లేదా రాగి లేదా మట్టితో తయారుచేయబడిన ఒక పాత్రను నీటితో నింపుతారు. ఆ పాత్రకు మొదట్లో మామిడి ఆకులు, వాటిపైన కొబ్బిరికాయను వుంచుతారు. తెలుపు లేదా ఎరుపు రంగు గల దారాన్ని ఆ పాత్ర మెడచుట్టూ పూర్తిగా లేదా సమచతురస్రాకారపు ఆకారంలో చుట్టబడి వుంటుంది. ఇలా ఈ విధంగా తయారుచేబడిన పాత్రను ‘‘కలశం’’ అంటారు. అటువంటి పాత్రను నీటితో లేదా బియ్యంతో నింపినప్పుడు.. దానిని ‘‘పూర్ణకుంభం’’గా పేర్కొంటారు.

పూర్వం సృష్టి ఆవిర్భవానికి ముందు... పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువు తన శేషశయ్యపై పవళించి (స్పష్టంగా, నిటారుగా) వున్నాడు. ఆ సమయంలో అతని నాభి ప్రాంతం నుంచి వెలువబడిన పద్మం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అలా ఆ విధంగా ఉద్భవించిన బ్రహ్మ.. ఈ యావత్ ప్రపంచాన్ని సృష్టించాడు.

అదేవిధంగా కలశంలో వున్న నీరు సృష్టి ఆవిర్భవంలో ప్రథమంగా పుట్టిన నీటికి ప్రతీకగా నిలుస్తుంది. విశ్వంలో వున్న అన్యప్రాణాలకు, జడ పదార్థాలకు ఇది అంతర్గత సృష్టికర్త. అలాగే ఆకులు, కొబ్బరికాయలు సృష్టికి ప్రతీకగా నిలుస్తాయి. కలశానికి చుట్టబడిన దారం సృష్టిలో బంధించిబడిన ‘‘ప్రేమ’’ను సూచించబడుతుంది. అందుకే కలశాన్ని శుభసూచికగా పూజించబడుతుంది.

పూర్వం రాక్షసులు, దేవతలు పాలసముద్రాన్ని వధించినప్పుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశంతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ‘‘కలశం’’ అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది.
Photo: కలశం

హిందూ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం.. ప్రాచీనకాలం నుంచి గృహ ప్రవేశాలకు, వివాహ శుభకార్యాలకు, నిత్య పూజా విధానాలలో, ఇంకా ఇంతరత్ర శుభకార్యాలలో కలశాన్ని తయారుచేసి, పూజిస్తారు. ఈ కలశాన్ని దివ్యమైన ప్రాణశక్తితో నిండివున్న జడ శరీరానికి ప్రతీకగా పేర్కొంటారు. అందువల్లే ఇది హిందూ శాస్త్రాలలో పూర్వం నుంచి తమ ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఇత్తడి లేదా రాగి లేదా మట్టితో తయారుచేయబడిన ఒక పాత్రను నీటితో నింపుతారు. ఆ పాత్రకు మొదట్లో మామిడి ఆకులు, వాటిపైన కొబ్బిరికాయను వుంచుతారు. తెలుపు లేదా ఎరుపు రంగు గల దారాన్ని ఆ పాత్ర మెడచుట్టూ పూర్తిగా లేదా సమచతురస్రాకారపు ఆకారంలో చుట్టబడి వుంటుంది. ఇలా ఈ విధంగా తయారుచేబడిన పాత్రను ‘‘కలశం’’ అంటారు. అటువంటి పాత్రను నీటితో లేదా బియ్యంతో నింపినప్పుడు.. దానిని ‘‘పూర్ణకుంభం’’గా పేర్కొంటారు.

పూర్వం సృష్టి ఆవిర్భవానికి ముందు... పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువు తన శేషశయ్యపై పవళించి (స్పష్టంగా, నిటారుగా) వున్నాడు. ఆ సమయంలో అతని నాభి ప్రాంతం నుంచి వెలువబడిన పద్మం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అలా ఆ విధంగా ఉద్భవించిన బ్రహ్మ.. ఈ యావత్ ప్రపంచాన్ని సృష్టించాడు.

అదేవిధంగా కలశంలో వున్న నీరు సృష్టి ఆవిర్భవంలో ప్రథమంగా పుట్టిన నీటికి ప్రతీకగా నిలుస్తుంది. విశ్వంలో వున్న అన్యప్రాణాలకు, జడ పదార్థాలకు ఇది అంతర్గత సృష్టికర్త. అలాగే ఆకులు, కొబ్బరికాయలు సృష్టికి ప్రతీకగా నిలుస్తాయి. కలశానికి చుట్టబడిన దారం సృష్టిలో బంధించిబడిన ‘‘ప్రేమ’’ను సూచించబడుతుంది. అందుకే కలశాన్ని శుభసూచికగా పూజించబడుతుంది.

పూర్వం రాక్షసులు, దేవతలు పాలసముద్రాన్ని వధించినప్పుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశంతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ‘‘కలశం’’ అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది.

No comments:

Post a Comment