ప్రదక్షిణ సమయంలో ఏ మంత్రాలు ఉపయోగిస్తారు? ఎన్నిసార్లు ప్రదక్షిణం చేయాలి?

సాధారణంగా దేాలయంలో ముమ్మార్లు ఆలయ ప్రదక్షిణ చేయాలి. మొక్కుబడుల ప్రకారం 11, 108 మొదలైన సంఖ్యలు ఉంటాయి. ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకాలను చదువుకోవాలి.
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే!!
పాపోయం పాప కర్మాహం పాపాత్మా పాపసంభవః!
త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల!!
అన్యధాశరణం నాస్తి త్వమేవ శరణం మమ!
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర!!
శక్తి దేవాలయాలకు వెళ్ళినప్పుడు పై శ్లోకాలలో దేవకు బదులుగా దేవి; శరణాగత వత్సలకు బదులుగా శరణాగత వత్సలే; మహేశ్వరకు బదులుగా మహేశ్వరి అని మార్చి చదువుకోవాలి. ఈ శబ్దాలు ఏ శక్తి దేవతకైనా సరిపోతాయి. అలాగే దేవ, మహేశ్వర మొదలైన శబ్దాలు విష్ణువుకైనా, శివునకైనా, ఇతర దైవానికైనా చెప్పవచ్చు.
"శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ "
ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం!
తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం!!
మర్కటేశ మహోత్సాహ సర్వశోకవినాశక!
శత్రున్ సంహర మాంరక్ష శ్రీయమాయుశ్చ దేహిమే!! అని పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి. తులసిని నమస్కరించేటప్పుడు, ప్రదక్షిణ చేసేటప్పుడు సంప్రదాయంగా చదివే శ్లోకం ఇది.
యన్మూలే సర్వ తీర్థాని యన్మధ్యే సర్వ దేవతా!
యదగ్రే సర్వ వేదాంశ్చ తులసీం త్వాం నమామ్యహం!!

No comments:

Post a Comment