విష్ణు ఆలయములకు వెళితే

విష్ణు ఆలయములకు వెళితే మనకు గొప్పగా కనిపించేది రాజగోపురం దానికి మనం నమస్కరించియే లోపలకు వెళ్ళవలెను

౨ మొదట మనకు కనపడేది బలి పీఠం అక్కడ సాష్టాంగముగా నమస్కరించి మన కామ క్రోధ అత్యాశ అహంకారాదులను బలి చేసి దర్శనమునకు వెళ్ళవలెను

౩ తర్వాత కనపడేది ధ్వజ స్తంభము ఇక్కడే ఉత్సవ వేళలో పతాకం ఎగురవేసి అది అందరికి ఉత్సవం జరుగుతున్నది అని చెప్పడానికి

౪ తర్వాత లక్ష్మి, రాముడు కృష్ణుడు నరసింహుడు ఆంజనేయుడు సుదర్శన చక్రం ఆండాళ్ ఆళ్వార్లు వీరందరినీ మొక్కి తర్వాత మూల స్థాన దర్శనమునకు వెళ్ళవలెను

౫ కోవెల నుండి బయటకు వచ్చేటప్పుడు కొద్ది సేపు కోవెలలో కూర్చొని రావలెను. అప్పడు స్వామీ నేను నా అభీష్టములను నీకు విన్నవిన్చుకొన్నాను నాకు ఏది సరి అని అనిపిస్తోంది దానిని నాకు ఇవ్వమని మనసారా ప్రార్థించ వలెను

౭ మరల ధ్వజస్థంభము వద్దకు వచ్చి ఉత్తర దిశగా తల పెట్టి సాష్టాంగ నమస్కారము చేయవలెను స్త్రీలు పంచాంగ నమస్కారం చేయవలెను .

No comments:

Post a Comment