శ్రీ సుబ్రహ్మణ్య స్వామి

శివ పార్వతీ నందనుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. ఆయనజననం లోకరక్షణ కొరకే. లోకోద్ధరణ కోసం పుట్టిన ఆ సుబ్రహ్మణ్య స్వామికి అనేక పేర్లు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి కుమారా స్వామి, దండాయుధ పాణి, షణ్ముఖుడు. తమిళులైతే ఈయనను ఆర్ముగం అనీ, మురుగన్ అనీ అంటారు. తమిళనాట ఉన్న ఒక కథనం ప్రకారం దానవులు లోక కంటకులుగా మారిపోవటంతో శివుడు కోపోద్రిక్తుడయ్యాడు. అప్పదు ఆయన మూడవ నేత్రం నుంచి ఆరు అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. వాటిలో నుంచి ఉద్భవించిన వాడే సుబ్రహ్మణ్య స్వామి. ఈయన అసామాన్య పరాక్రమవంతుడు. దేవా సైన్యాధిపతి. దానవ సంహారి. దక్షిణ భారత దేశంలో ఉన్న ఒక నానుడి ప్రకారం ప్రపంచంలో ఎక్కడెక్కడ కొండ ఉంటుందో అక్కడక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి తప్పని సరిగా ఉంటుంది. వాటిల్లో ముఖ్యమైనవి తమిళనాడులో ఉన్న ఆరు దేవాలయాలు. ఈ ఆరింటినీ కలిపి 'షట్ రణ శిబిరాలు' (six battle camps)అని అంటారు. అవి: 1. పళని 2. పళముదిర్ కోలయ్ 3. స్వామి మలయ్ 4. తిరుత్తణి 5. తిరుపరంకుండ్రం 6. తిరుచెందూర్

No comments:

Post a Comment