సుదర్శన చక్రo - వామన పురాణం

సుదర్శన చక్రం వృత్తాంతం వివిధ పురాణాలలో చెప్పబడింది. 
వామన పురాణం ఆధారిత వృత్తాంతం ప్రకారం సుదర్శన చక్ర ప్రాప్తి కథ. ఇది శ్రీదాముడు అనే రాక్షసుడు లక్ష్మీ దేవిని వశపరచుకొంటాడు. శ్రీమహావిష్ణువు వద్ద ఉన్న శ్రీవత్సం కూడా వశపరచుకొందాం అని అనుకొంటుండగా శ్రీమహావైష్ణువు చింతా క్రాంతుడై పరమశివుడి నివాస స్థానం అయిన కైలాసం కి వెళ్ళి శివుని ప్రార్థిస్తాడు. శివుడు యోగ తపస్సులో ఉండడం చూసి శివుడి కోసం వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తాడు. శివుడికి మహావిష్ణువు జరిగిన వృత్తాంతాన్ని వివరిస్తాడు. శ్రీదాముడిని చంపడానికి అస్త్రాన్ని ప్రసాదించమంటాడు. శివుడు ప్రీతి చెంది సుదర్శన చక్రం అనే చక్రాయుధాన్ని ఇస్తాడు. విష్ణువు తన నేత్రాన్ని సమర్పించుకొంటాడు. పరమ శివుడు ప్రసన్నుడై మహావిష్ణువు కి అత్యంత శక్తి వంతమైన సుదర్శన చక్రాన్ని ఇస్తాడు. ఆ చక్రంలో 12 ఆకులు, 6 నాభులు, 2 యుగాలు ఉంటాయి, అవి సకలదేవతలను, రాశులని, ఋతువులను, అగ్నిని, సోముడు, మిత్రవరుణులు, ఇంద్రుడు, విశ్వ దేవతలు, ప్రజాపతి, హనుమంతుడు,ధన్వంతరి, తపస్సు, చైత్రమాసం నుండి ఫాల్గుణ మాసం వరకు ప్రతిష్ఠమై ఉంటాయి అని చెబుతాడు పరమశివుడు. విష్ణువు ఆ సుదర్శన చక్రం యొక్క శక్తిని శివుడి మీదనే ప్రయోగం చేయవలేననినున్నదని శివునితో ప్లుతాడు. శివుడు అందుకు అంగీకరిస్తాడు, పరమ శక్తి వంతమైన ఆ సుదర్శన చక్రం శివుడిని విశ్వేశుడు, యజ్ఞేశుడు, యజ్ఞయాజకుడు అనే 3 భాగాలుగా ఖండిస్తుంది, ఆ విధంగా ఖండింపడిన శివుని చూసి విష్ణువు ఖిన్నుడౌతాడు. అప్పుడు శివుడు కనిపించి సుదర్శన చక్రం తన పాకృత, వికృత రూపాలను ఖండించింది కాని తన తన స్వాభవమైన తత్వాన్ని ఏమి చేయలేక పోయిందని, ఆ సుదర్శన చక్రాన్ని తీసుకొని శ్రీదాముడి సంహరించమని చెబుతాడు. ఆ మూడు ఖండాలుగా హిరణ్యాక్ష, సువర్ణాక్ష, విరుపాక్ష గా పూజింపడుతాయని చెబుతాడు.

No comments:

Post a Comment