కార్తీక పురాణము 6వ అధ్యాయము (దీపదానవిధి - మాహాత్మ్యం)

ఓ రాజశ్రేష్ఠుడా! ఏ మానవుడు కార్తీకమాసము నెలరోజులూ పరమేశ్వరుని, శ్రీమహావిష్ణువును, పంచామృత స్నానంచేయించి కస్తూరి కలిపిన మంచిగంధపు నీటితో భక్తిగా పూజించునో, అట్టివానికి అశ్వమేథయాగము చేసినంతపుణ్యము దక్కును. అటులనే యే మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట యెటులన పైడిప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి, వత్తులు చేయవలెను. వరిపిండితోగాని, గోధుమపిండితోగాని ప్రమిదవలె చేసి వత్తులు వేసి, ఆవు నెయ్యి వేసి, దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తికొలది దక్షిణకూడా యివ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీకమాసమందు ప్రతిదినము చేసి ఆఖరిరోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి నిండుగా పోసి వెనుకచేసిన ప్రకారముగా గోధుమపిండితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి యీ నెలరోజులూ దానముచేసిన బ్రాహ్మణునకే యిదికూడా దానమిచ్చిన యెడల సకలైశ్వర్యములు కలుగుటయేగాక మోక్షప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు యిట్లు వచింప వలెను.

శ్లో|| సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వసంప త్సుఖావహం
దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ||

అని స్తోత్రంచేసి దీపదానం చేయవలెను. దీని అర్ధమేమనగా, "అన్నివిధముల జ్ఞానం కలుగచేయునదియు, సకల సంపదల నిచ్చునదియునగు యీ దీపదానము చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక!" యని అర్థము. ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధాన చేయవలెను. శక్తిలేని యెడల పదిమంది బ్రాహ్మణులకైననూ భోజనమిడి దక్షిణ తాంబూలముల నివ్వవలెను. ఈ విధంగా పురుషులు గాని, స్త్రీలుగాని యే ఒక్కరు చేసిననూ సిరిసంపదలు, విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు. దీనిని గురించి ఒక యితిహాసం గలదు. దానిని వివరించెద నాలకింపుమని వశిష్ఠుడు జనకునితో యిట్లు చెప్పసాగెను.

లుబ్ద వితంతువు స్వర్గమున కేగుట

పూర్వకాలమున ద్రవిడదేశమునం దొకగ్రామమున నొక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొలదికాలమునకే భర్త చనిపోయాడు. సంతానముగాని, ఆఖరికి బంధువులుగాని లేరు. అందుచే ఆమె యితరుల యిండ్లలో దాసిపని చేయుచూ, అక్కడనే భుజించుచు, ఒకవేళ వారి సంతోషము కొలది యేమైనా వస్తువులిచ్చిన యెడల ఆ వస్తువులను యితరులకు హెచ్చుధరకు అమ్ముకొనుచు అవిధముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు, దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువధరకు కొని యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొనుచు - సొమ్ము కూడబెట్టుకొనుచుండెను.

ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల యిండ్లలో దాసీపనులు చేస్తూ, తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి! ఆమె ఒక్కదినము కూడ ఉపవాసముగాని, దేవుని మనసారా ధ్యానించుటగాని చేసి యెరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్లేవారిని జూచి అవహేళనచేసి, యే ఒక్క భిక్షగాడికిని పిడికెడు బియ్యము పెట్టక, తాను తినక ధనమును కూడ్బెట్టుచుండెడిది.

అటుల కొంతకాలము జరిగెను. ఒకరోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి, ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచిచెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె కడకు వెళ్లి "అమ్మా! నా హితవచనము లాలకింపుము. నీకు కోపము వచ్చినాసరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొనిపోవునో యెవరూ చెప్పలేరు. పంచభూతములు, సప్తధాతువులతో నిర్మించబడిన యీ శరీరములోని ప్రాణము - జీవము పోగానే చర్మము, మాంసము కుళ్లి దుర్వాసనకొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి యీ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాఅలోచన. తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడత దానిని తినేద్దామని భ్రమించి, దగ్గరకు వెళ్లి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా యీ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో బడి నశించుచున్నాడు. కాన, నా మాట లాలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా అర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దానధర్మములు చేసి, పుణ్యమునుసంపాదించుకొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాధికములు చేసి మోక్షము నొందుము. నీ పాపపరిహారార్థముగా, వచ్చే కార్తీక మాస మంతయు ప్రాతఃకాలమున నదీస్నానమాచరించి, దానధర్మముల జేసి, బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగల" వని వుపదేశమిచ్చెను.

అ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటినుండి దానధర్మములు చేయుచు కార్తీకమాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము నొందెను. కావున కార్తీకమాసవ్రతములో అంత మాహత్మ్యమున్నది.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి ఆరవ యధ్యాయము
ఆరవ రోజు పారాయణము సమాప్తము.
 
Photo: కార్తీక పురాణము 6వ అధ్యాయము (దీపదానవిధి - మాహాత్మ్యం) 

ఓ రాజశ్రేష్ఠుడా! ఏ మానవుడు కార్తీకమాసము నెలరోజులూ పరమేశ్వరుని, శ్రీమహావిష్ణువును, పంచామృత స్నానంచేయించి కస్తూరి కలిపిన మంచిగంధపు నీటితో భక్తిగా పూజించునో, అట్టివానికి అశ్వమేథయాగము చేసినంతపుణ్యము దక్కును. అటులనే యే మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట యెటులన పైడిప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి, వత్తులు చేయవలెను. వరిపిండితోగాని, గోధుమపిండితోగాని ప్రమిదవలె చేసి వత్తులు వేసి, ఆవు నెయ్యి వేసి, దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తికొలది దక్షిణకూడా యివ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీకమాసమందు ప్రతిదినము చేసి ఆఖరిరోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి నిండుగా పోసి వెనుకచేసిన ప్రకారముగా గోధుమపిండితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి యీ నెలరోజులూ దానముచేసిన బ్రాహ్మణునకే యిదికూడా దానమిచ్చిన యెడల సకలైశ్వర్యములు కలుగుటయేగాక మోక్షప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు యిట్లు వచింప వలెను.

శ్లో|| సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వసంప త్సుఖావహం
      దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ||

అని స్తోత్రంచేసి దీపదానం చేయవలెను. దీని అర్ధమేమనగా, "అన్నివిధముల జ్ఞానం కలుగచేయునదియు, సకల సంపదల నిచ్చునదియునగు యీ దీపదానము చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక!" యని అర్థము. ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధాన చేయవలెను. శక్తిలేని యెడల పదిమంది బ్రాహ్మణులకైననూ భోజనమిడి దక్షిణ తాంబూలముల నివ్వవలెను. ఈ విధంగా పురుషులు గాని, స్త్రీలుగాని యే ఒక్కరు చేసిననూ సిరిసంపదలు, విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు. దీనిని గురించి ఒక యితిహాసం గలదు. దానిని వివరించెద నాలకింపుమని వశిష్ఠుడు జనకునితో యిట్లు చెప్పసాగెను.

లుబ్ద వితంతువు స్వర్గమున కేగుట

పూర్వకాలమున ద్రవిడదేశమునం దొకగ్రామమున నొక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొలదికాలమునకే భర్త చనిపోయాడు. సంతానముగాని, ఆఖరికి బంధువులుగాని లేరు. అందుచే ఆమె యితరుల యిండ్లలో దాసిపని చేయుచూ, అక్కడనే భుజించుచు, ఒకవేళ వారి సంతోషము కొలది యేమైనా వస్తువులిచ్చిన యెడల ఆ వస్తువులను యితరులకు హెచ్చుధరకు అమ్ముకొనుచు అవిధముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు, దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువధరకు కొని యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొనుచు - సొమ్ము కూడబెట్టుకొనుచుండెను.

ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల యిండ్లలో దాసీపనులు చేస్తూ, తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి! ఆమె ఒక్కదినము కూడ ఉపవాసముగాని, దేవుని మనసారా ధ్యానించుటగాని చేసి యెరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్లేవారిని జూచి అవహేళనచేసి, యే ఒక్క భిక్షగాడికిని పిడికెడు బియ్యము పెట్టక, తాను తినక ధనమును కూడ్బెట్టుచుండెడిది.

అటుల కొంతకాలము జరిగెను. ఒకరోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి, ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచిచెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె కడకు వెళ్లి "అమ్మా! నా హితవచనము లాలకింపుము. నీకు కోపము వచ్చినాసరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొనిపోవునో యెవరూ చెప్పలేరు. పంచభూతములు, సప్తధాతువులతో నిర్మించబడిన యీ శరీరములోని ప్రాణము - జీవము పోగానే చర్మము, మాంసము కుళ్లి దుర్వాసనకొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి యీ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాఅలోచన. తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడత దానిని తినేద్దామని భ్రమించి, దగ్గరకు వెళ్లి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా యీ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో బడి నశించుచున్నాడు. కాన, నా మాట లాలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా అర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దానధర్మములు చేసి, పుణ్యమునుసంపాదించుకొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాధికములు చేసి మోక్షము నొందుము. నీ పాపపరిహారార్థముగా, వచ్చే కార్తీక మాస మంతయు ప్రాతఃకాలమున నదీస్నానమాచరించి, దానధర్మముల జేసి, బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగల" వని వుపదేశమిచ్చెను.

అ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటినుండి దానధర్మములు చేయుచు కార్తీకమాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము నొందెను. కావున కార్తీకమాసవ్రతములో అంత మాహత్మ్యమున్నది.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి ఆరవ యధ్యాయము
                                ఆరవ రోజు పారాయణము సమాప్తము.

No comments:

Post a Comment