నాగుల చవితి (అక్టోబర్ 27, 2014, సోమవారం)

నాగులపామును హిందువులు ఎంతో ఆరాధ్యంగా, దైవంగా పూజించుకుంటారు. కార్తీక శుద్ధ చతుర్థిని నాగులచవితి అంటారు. ఇది దీపావళి అమావాస్య తరువాత వస్తుంది. నాగులచవితిని కొందరు శ్రావణశుద్ధచతుర్థినాడు కూడా జరుపుకుంటారు. ఈ పండుగరోజు నాగేంద్రుడిని అర్చిస్తే..శరీరంలో వున్న సర్వరోగాలు పోయి, సౌభాగ్యవంతులు అవుతారని భారతీయులు ప్రగాఢంగా నమ్ముతారు.
యోగాశాస్త్రం ప్రకారం.. మన శరీరంలో వున్న వెన్నెముక - కుండలినీశక్తి మూలాధారచక్రంలో ‘‘పాము’’ ఆకారంలో వుంటుందని తెలుపుతున్నారు. ఇది మానవునిలో సత్వగుణ సంపత్తిని తొలగిస్తూ వుంటుందంటారు. అప్పుడు నాగులచవితిరోజున విషసర్ప పుట్టలను ఆరాధించి, అందులో పాలుపోస్తే మానవునిలో వున్న విషసర్పం కూడా నశిస్తుందని నమ్ముతారు.
ఇలా ప్రతినాగులచవితినాడు స్త్రీలు ఆరాధిస్తే.. వారికి శుభప్రదమైన సంతానం కలుగుతుందని, ఆ పిల్లలు కూడా ఆచరిస్తే వారికి మంచి భర్తలు లభిస్తారని పలువురు విశ్వసిస్తారు.
ఈ నాగులచవితి ఈనాటినుంచి చేస్తున్న సంస్కృతికాదు.. పురాతనకాలాల నుంచి ఈ సంప్రదాయం నడుస్తూ వస్తోంది. దీంతో సుఖసంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని, సంతానప్రాప్తి కలుగుతుందని పురాణాలలో కూడా ఎన్ని కథలున్నాయి.

నాగులచవితి నాడు
‘‘కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ |
ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్‌ ||’’
అనే శ్లోకాన్ని పఠిస్తే.. కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలలో పేర్కొనబడింది.

వృశ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అంటారు. ఎందుకంటే.. సూర్యుడు ఈ నక్షత్రంలో సరిగ్గా కార్తీక శుద్ధ చవితినాడు ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించిన రోజుని నాగుల చవితి అంటారు.
ప్రస్తుతమున్న శాస్త్రీయపద్ధతి ద్వారా చెప్పాలంటే.. సర్పాలు మనకు పరోక్షంగా సహాయపడుతున్నాయి. ఎందుకంటే భూమి అంతర్భాగంలో వున్న క్రిముల్ని, పురుగుల్ని ఇవి తినేసి భూసారాన్ని కాపాడుతున్నాయి.

బ్రహ్మ పురాణంలో సంతానం కథ :
చంద్రవంశానికి రాజయిన శూర్యసేనుడు, అతని భార్య సంతానం కలగడం కోసం చాలారోజులు తపస్సు చేశారు. అయితే వారికి ఒక సర్పం (మగ) జన్మించింది. అయినా వీరు ఆ సర్పాన్ని ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. కొన్నిరోజుల తరువాత ఆ సర్పం మనుషుల్లా మాట్లాడటం మొదలుపెట్టింది. దానిని చూసి రాజు, రాజుభార్య ఒక్కసారి ఖంగుతిన్నారు.

ఆ పాము తనకు ఉపనయనం చేయించమని కోరింది. ఆ రాజు అలాగే చేశాడు. కొన్నాళ్ల తరువాత ఆ సర్పం తనకు పెళ్లి చేయించమని కోరింది. దాంతో ఆ రాజు ఒక రాకుమార్తెతో పెళ్లిచేసి తిరిగి రప్పించుకున్నారు.
అత్తింటికి వచ్చిన ఆ కోడలు తన భర్త పాము అని తెలుసుకుంటుంది. అయినా ఆమె ఏమాత్రం భయపడకుండా అతనితోనే కలిసిమెలిసి వుంటుంది. ఒకరోజు పాము ‘‘నన్ను చూసి నువ్వు ఎందుకు భయపడటం లేదు’’ అని అడుగుతుంది. అప్పుడు ఆమె ‘‘భర్త ఎటువంటివాడైనా స్త్రీకి దైవంతో సమానం. దైవాన్ని చూసి ఎవరైనా భయపడతారా’’ అని సమాధానం ఇస్తుంది.

ఇది విన్న ఆ పాము ‘‘శివుని శాపం వల్ల నేను ఇలా పాములా అయ్యాను’’ అని చెబుతుంది. అప్పుడు వాళ్లిద్దరూ కలిసి చవితి వ్రతాన్ని ఆచరించి, గౌతమినదిలో స్నానం చేసి శివుని సన్నిధిలో శాపం నుండి విమోచనం పొందుతాడు.
 — with మాధవి విడియాల and 8 others.
Photo: నాగుల చవితి (అక్టోబర్ 27, 2014, సోమవారం)

నాగులపామును హిందువులు ఎంతో ఆరాధ్యంగా, దైవంగా పూజించుకుంటారు. కార్తీక శుద్ధ చతుర్థిని నాగులచవితి అంటారు. ఇది దీపావళి అమావాస్య తరువాత వస్తుంది. నాగులచవితిని కొందరు శ్రావణశుద్ధచతుర్థినాడు కూడా జరుపుకుంటారు. ఈ పండుగరోజు నాగేంద్రుడిని అర్చిస్తే..శరీరంలో వున్న సర్వరోగాలు పోయి, సౌభాగ్యవంతులు అవుతారని భారతీయులు ప్రగాఢంగా నమ్ముతారు. 
యోగాశాస్త్రం ప్రకారం.. మన శరీరంలో వున్న వెన్నెముక - కుండలినీశక్తి మూలాధారచక్రంలో ‘‘పాము’’ ఆకారంలో వుంటుందని తెలుపుతున్నారు. ఇది మానవునిలో సత్వగుణ సంపత్తిని తొలగిస్తూ వుంటుందంటారు. అప్పుడు నాగులచవితిరోజున విషసర్ప పుట్టలను ఆరాధించి, అందులో పాలుపోస్తే మానవునిలో వున్న విషసర్పం కూడా నశిస్తుందని నమ్ముతారు. 
ఇలా ప్రతినాగులచవితినాడు స్త్రీలు ఆరాధిస్తే.. వారికి శుభప్రదమైన సంతానం కలుగుతుందని, ఆ పిల్లలు కూడా ఆచరిస్తే వారికి మంచి భర్తలు లభిస్తారని పలువురు విశ్వసిస్తారు.
ఈ నాగులచవితి ఈనాటినుంచి చేస్తున్న సంస్కృతికాదు.. పురాతనకాలాల నుంచి ఈ సంప్రదాయం నడుస్తూ వస్తోంది. దీంతో సుఖసంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని, సంతానప్రాప్తి కలుగుతుందని పురాణాలలో కూడా ఎన్ని కథలున్నాయి. 

నాగులచవితి నాడు
 ‘‘కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ | 
    ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్‌ ||’’ 
అనే శ్లోకాన్ని పఠిస్తే.. కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలలో పేర్కొనబడింది. 

 వృశ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అంటారు. ఎందుకంటే.. సూర్యుడు ఈ నక్షత్రంలో సరిగ్గా కార్తీక శుద్ధ చవితినాడు ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించిన రోజుని నాగుల చవితి అంటారు. 
ప్రస్తుతమున్న శాస్త్రీయపద్ధతి ద్వారా చెప్పాలంటే.. సర్పాలు మనకు పరోక్షంగా సహాయపడుతున్నాయి. ఎందుకంటే భూమి అంతర్భాగంలో వున్న క్రిముల్ని, పురుగుల్ని ఇవి తినేసి భూసారాన్ని కాపాడుతున్నాయి. 

బ్రహ్మ పురాణంలో సంతానం కథ : 
చంద్రవంశానికి రాజయిన శూర్యసేనుడు, అతని భార్య సంతానం కలగడం కోసం చాలారోజులు తపస్సు చేశారు. అయితే వారికి ఒక సర్పం (మగ) జన్మించింది. అయినా వీరు ఆ సర్పాన్ని ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. కొన్నిరోజుల తరువాత ఆ సర్పం మనుషుల్లా మాట్లాడటం మొదలుపెట్టింది. దానిని చూసి రాజు, రాజుభార్య ఒక్కసారి ఖంగుతిన్నారు. 

ఆ పాము తనకు ఉపనయనం చేయించమని కోరింది. ఆ రాజు అలాగే చేశాడు. కొన్నాళ్ల తరువాత ఆ సర్పం తనకు పెళ్లి చేయించమని కోరింది.  దాంతో ఆ రాజు ఒక రాకుమార్తెతో పెళ్లిచేసి తిరిగి రప్పించుకున్నారు. 
అత్తింటికి వచ్చిన ఆ కోడలు తన భర్త పాము అని తెలుసుకుంటుంది. అయినా ఆమె ఏమాత్రం భయపడకుండా అతనితోనే కలిసిమెలిసి వుంటుంది. ఒకరోజు పాము ‘‘నన్ను చూసి నువ్వు ఎందుకు భయపడటం లేదు’’ అని అడుగుతుంది. అప్పుడు ఆమె ‘‘భర్త ఎటువంటివాడైనా స్త్రీకి దైవంతో సమానం. దైవాన్ని చూసి ఎవరైనా భయపడతారా’’ అని సమాధానం ఇస్తుంది. 

ఇది విన్న ఆ పాము ‘‘శివుని శాపం వల్ల నేను ఇలా పాములా అయ్యాను’’ అని చెబుతుంది. అప్పుడు వాళ్లిద్దరూ కలిసి చవితి వ్రతాన్ని ఆచరించి, గౌతమినదిలో స్నానం చేసి శివుని సన్నిధిలో శాపం నుండి విమోచనం పొందుతాడు.

No comments:

Post a Comment